గత ఏడాది కరోనా కారణంగా ప్రారంభం అవ్వాల్సిన సినిమాలు ఆలస్యం అవుతూ వచ్చాయి.అందులో ఒకటి ఎన్టీఆర్ 30 సినిమా.
ఆర్ ఆర్ ఆర్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఎన్టీఆర్ తో సినిమా ను మొదలు పెట్టాలనుకుని త్రివిక్రమ్ దాదాపు ఏడాది పాటు వెయిట్ చేశాడు.కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది.
కరోనా కారణంగా ఎన్టీఆర్ మరింతగా జక్కన్న కు డేట్లు ఇవ్వాల్సి వస్తుంది.దాంతో ఎన్టీఆర్ తో సినిమా ను త్రివిక్రమ్ క్యాన్సిల్ చేసుకుని మహేష్ బాబు వద్దకు వెళ్లాడు.
ఎన్టీఆర్ 30 ని క్యాన్సిల్ చేసుకున్న వెంటనే త్రివిక్రమ్ కు మహేష్ బాబు తో ఆఫర్ దక్కిందని తెలుస్తోంది.మహేష్ బాబు తో ఆఫర్ వల్లే ఎన్టీఆర్ మూవీని క్యాన్సిల్ చేసుకున్నాడేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మళ్లీ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల కాంబో ఉంటుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ 30 అలా చేతులు మారితో అల్లు అర్జున్ సినిమా విషయంలో కూడా అటు ఇటు గా మారింది.
పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వం లో సినిమా ను బన్నీ చేయాల్సి ఉంది.కాని పుష్ప సినిమా ఆలస్యం అవుతోంది.
దానికి తోడు బన్నీ సినిమా పుష్పను రెండు పార్ట్ లుగా మార్చేందుకు సిద్దం అయ్యారు.అందుకే సినిమా మరింత ఆలస్యం అవ్వబోతుందని తేలిపోయింది.
అందుకే ఎన్టీఆర్ తో సినిమా కు కొరటాల శివ షిప్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ మరియు కొరటాల శివ కాంబో మూవీ కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు అయినా ఈ కాంబో సెట్ అయ్యిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా పుష్ప రెండు పార్ట్ ల కారణంగా క్యాన్సిల్ అయ్యింది.మొత్తానికి ఎన్టీఆర్.
అల్లు అర్జున్ లు మళ్లీ ఆ దర్శకుల తో వర్క్ చేసే అవకాశం ఉండా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.ఇద్దరు కూడా బిగ్గెస్ట్ అవకాశాలను వదులుకున్నట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.