ఈ ఇద్దరు హీరోలు ఈగోలకు పోయి నిర్మాతలను ముంచేలా ఉన్నారే

పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రావడం వల్ల రెండు సినిమాలకు కూడా నష్టం వాటిల్లుతుంది.ఈమద్య కాలంలో మొదటి రెండు మూడు రోజుల వసూళ్లే చాలా కీలకంగా ఉన్నాయి.

 Allu Arjun And Mahesh Babu Coming Forthis Sankranthi-TeluguStop.com

అందుకే ఒక సినిమాకు మరో సినిమా పోటీ లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.సంక్రాంతికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు వస్తూనే ఉంటాయి.

ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు ఉన్నాయి.కాని ఈసారి సంక్రాంతి సీజన్‌ పోటీ చాలా వింతగా ఆసక్తికరంగా సాగబోతుంది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన మహేష్‌బాబు అల్లు అర్జున్‌లు వారు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో చిత్రాలను ఒకే రోజున సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.మొదట ఈ రెండు సినిమాలను రెండు లేదా మూడు రోజుల గ్యాప్‌లో విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి.

కాని ఇద్దరు హీరోలు కూడా నేను వెనక్కు తగ్గనంటే నేను కూడా వెనక్కు తగ్గను.అసలు నేను వెనక్కు తగ్గాల్సిన అవసరం ఏంటీ అంటూ ఇద్దరు అంటున్నారు.

Telugu Allu Arjun, Mahesh Babu, Sankranthi, Vijaya Shanthi-

సంక్రాంతి సీజన్‌ కనుక రెండు రోజుల గ్యాప్‌లో వస్తే రెండు సినిమాలకు కూడా మంచి బెనిఫిట్‌ ఉంటుందని అంతా భావించారు.కాని ఇద్దరు కూడా ఈగోలకు పోయి రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యేలా చేస్తున్నారు.ఈ కారణంగా నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎంతో మంది చెప్పినా కూడా ఆ ఇద్దరు హీరోలు వినక పోవడంతో చేసేది ఏమీ లేక నిర్మాతలు అదే రోజున విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube