పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రావడం వల్ల రెండు సినిమాలకు కూడా నష్టం వాటిల్లుతుంది.ఈమద్య కాలంలో మొదటి రెండు మూడు రోజుల వసూళ్లే చాలా కీలకంగా ఉన్నాయి.
అందుకే ఒక సినిమాకు మరో సినిమా పోటీ లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.సంక్రాంతికి ఖచ్చితంగా రెండు మూడు సినిమాలు వస్తూనే ఉంటాయి.
ఈ ఏడాది సంక్రాంతికి కూడా పలు సినిమాలు ఉన్నాయి.కాని ఈసారి సంక్రాంతి సీజన్ పోటీ చాలా వింతగా ఆసక్తికరంగా సాగబోతుంది.
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన మహేష్బాబు అల్లు అర్జున్లు వారు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠపురంలో చిత్రాలను ఒకే రోజున సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.మొదట ఈ రెండు సినిమాలను రెండు లేదా మూడు రోజుల గ్యాప్లో విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి.
కాని ఇద్దరు హీరోలు కూడా నేను వెనక్కు తగ్గనంటే నేను కూడా వెనక్కు తగ్గను.అసలు నేను వెనక్కు తగ్గాల్సిన అవసరం ఏంటీ అంటూ ఇద్దరు అంటున్నారు.
సంక్రాంతి సీజన్ కనుక రెండు రోజుల గ్యాప్లో వస్తే రెండు సినిమాలకు కూడా మంచి బెనిఫిట్ ఉంటుందని అంతా భావించారు.కాని ఇద్దరు కూడా ఈగోలకు పోయి రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యేలా చేస్తున్నారు.ఈ కారణంగా నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎంతో మంది చెప్పినా కూడా ఆ ఇద్దరు హీరోలు వినక పోవడంతో చేసేది ఏమీ లేక నిర్మాతలు అదే రోజున విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.