అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాను చేస్తుండగా.కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ఆచార్య సినిమాను చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే.
ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వడమే ఆలస్యం వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ వచ్చే మే లో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దంగా ఉంది.ఇక ఈ సినిమా కథ మరియు హీరోయిన్ విషయంలో అనేక వార్తలు షికారు చేశాయి.
ఈసమయంలోనే మరో వార్త వచ్చింది.ఈ సినిమా ను వచ్చే ఏడాదిలో ప్రారంభించి 2022 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారట.
దర్శకుడు కొరటాల శివ మొదట వచ్చే ఏడాదిలోనే సినిమాను విడుదల చేయాలని భావించినా కూడా కరోనా కారణంగా ఆచార్య సినిమా మరింత ఆలస్యం అవుతుంది.విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
కనుక బన్నీతో చేయబోతున్న సినిమాను ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.అన్ని వర్గాల వారు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రికార్డు స్థాయి బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాతో బన్నీ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.
బన్నీ మరియు కొరటాల శివ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బన్నీ పుష్ప సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు.అలాగే ఈ సినిమాను కూడా ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తారు.
అంటే కొరటాలకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.బన్నీతో హిందీలో అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్న కొరటాల శివ ఇప్పటికే యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథను ఎంపిక చేసుకోవడం జరిగింది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.