అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప సినిమా విడుదలకు సిద్ధమైంది.ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
పుష్ప రెండు పార్టులుగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.పుష్ప రెండు పార్ట్ ల మధ్యలో ఒక వేరే సినిమాను అల్లు అర్జున్ చేస్తాడని సమాచారం అందుతోంది.
ఇప్పటికే అల్లు అర్జున్ ఐకాన్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి.కానీ దర్శకుడు ఆ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.
అల్లు అర్జున్ కూడా ఆ ప్రాజెక్టు ను వదిలేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత నటించబోతున్న సినిమాపై ఒక క్లారిటీ అయితే వచ్చినట్లుగా అనిపిస్తుంది.
అది ఏంటంటే నిన్న జరిగిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్ పాల్గొన్నాడు.ఆ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటికే అల్లు అర్జున్ సరైనోడు సినిమా చేశాడు.వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి.అఖండ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు అల్లు అర్జున్ పాల్గొనడం వల్ల ఆయన తదుపరి సినిమా కచ్చితంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉండబోతుంది అంటూ అంత నమ్మకంగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి.
అల్లు అర్జున్ మరియు బోయపాటి మూవీ మరో సరైనోడు మూవీ రేంజ్ లో ఉంటుందని నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.సరైనోడు మూవీ లాంటి విజయాన్ని అల్లు అర్జున్ కి బోయపాటి ఇస్తాడని కొందరు మెగా అభిమానులు భావిస్తుంటే మరి కొందరు మాత్రం రామ్ చరణ్ కి ఇచ్చిన వినయ విధేయ రామ సినిమా ఫలితాన్ని అల్లు అర్జున్ కి ఇవ్వడు కదా అంటూ టెన్షన్ పడుతున్నారు.
మొత్తానికి అల్లు అర్జున్ తదుపరి సినిమా బోయపాటి శీను దర్శకత్వం లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది