వరుస విజయాల తర్వాత అల్లు అర్జున్కు ‘నా పేరు సూర్య’ చిత్రంతో అట్టర్ ఫ్లాప్ ఖాతాలో పడటం జరిగింది.భారీ అంచనాలు పెట్టుకున్న నాపేరు సూర్య చిత్రం నిరాశ పర్చడంతో అల్లు అర్జున్ ఆలోచనల్లో పడ్డాడు.
నా పేరు సూర్య చిత్రం సక్సెస్ అయితే ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కేది.కాని ఫ్లాప్ తర్వాత ప్రయోగం ఎందుకు అంటూ ఆ చిత్రాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లుగా సమాచారం అందుతుంది.
ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ను చేయానే పట్టుదలతో అల్లు అర్జున్ ఉన్నాడు.అలాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ను కేవలం హరీష్ శంకర్ మాత్రమే చేయగలడు అనే నమ్మకంతో బన్నీ ఉన్నాడు.
వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘డీజే’ చిత్రం వచ్చింది.గత సంవత్సరంలో సూపర్ హిట్ చిత్రాల జాబితాలో నిలిచిన డీజే చిత్రం బన్నీ కెరీర్లో కూడా పెద్ద విజయంగా నిలిచింది.అలాంటి సినిమాను తనకు అందించిన హరీష్ శంకర్తో మరోసారి సినిమా చేయాలనే నిర్ణయానికి అల్లు అర్జున్ వచ్చాడు.ఇటీవలే వీరు కలిశారు కూడా.వీరు కలిసినప్పటి సెల్ఫీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.వీరితో పాటు పూజా హెగ్డే కూడా ఆ సెల్ఫీలో ఉంది.
అంటూ డీజే చిత్రం కోసం వర్క్ చేసిన దర్శకుడు, హీరో హీరోయిన్ల కాంబో రిపీట్ కాబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఇప్పటి వరకు హరీష్ శంకర్తో మూవీ గురించి బన్నీ నుండి కాని, మెగా ఫ్యామిలీ నుండి కాని ఎలాంటి ప్రకటన రాలేదు.
కాని ప్రస్తుతం సినీవర్గాల్లో మారుతున్న సమీకరణాలు చూస్తుంటే ఖచ్చితంగా బన్నీ, హరీష్ల కాంబోలో సినిమా ఉంటుందని అనిపిస్తుంది.డీజే సమయంలోనే ఒక పక్కా ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ను దర్శకుడు హరీష్ శంకర్ వినిపించాడని, అందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ సమాచారం అందుతుంది.
‘డీజే’ తర్వాత ఇప్పటి వరకు హరీష్ శంకర్ తర్వాత సినిమాకు కమిట్ కాలేదు.దిల్రాజు బ్యానర్లో ‘దాగుడు మూతలు’ అనే చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.
కాని ఆ చిత్రం మల్టీస్టారర్ అవ్వడంతో హీరోు సెట్ అవ్వడం లేదని తెలుస్తోంది.తాను అనుకున్న ఇద్దరు హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో ప్రస్తుతానికి దాగుడు మూతలు ఆపేసి మరో డీజేకి ఏర్పాట్లు చేస్తున్నాడు.
డీజేకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.