స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా ఇచ్చిన బూస్ట్తో బన్నీ తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించాడు.
ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన లేటెస్ట్ మూవీని ప్రారంభించిన బన్నీ, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ను వాయిదా వేసుకున్నాడు.
ఇక ఏప్రిల్ 8న పుట్టినరోజు జరుపుకుంటున్న బన్నీ, తన ఫ్యాన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఏప్రిల్ 6న అల్లు అర్జున్ 20వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించగా, ఆ అప్డేట్ ఏమిటనే విషయంపై చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం ఓ ఇంట్రెస్టింగ్ రివీల్ చేసింది.బన్నీ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 9 గంటలకు తెలుపుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సినిమా ఎర్రచందనం బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతునండటం, శేషాచలం అడవిలో ఈ సినిమా కథ నడుస్తుందనే విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో బన్నీ చిత్తూరు యాసతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు.
దీంతో తాజా అప్డేట్ను కూడా చిత్తూరు యాసలో రివీల్ చేశారు చిత్ర యూనిట్.దీంతో ప్రేక్షకులు ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.