టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో నటిస్తున్నారు.
ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది.ఈ సినిమాపై అల్లు అభిమానులు ఇప్పటికే భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
అంతే కాకుండా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ గారాలపట్టి నవంబర్ 21న ఆరవ వసంతంలోకి అడుగుపెట్టింది.
అల్లు అర్జున్ ఈ బర్త్ డే వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చేయాలనుకున్నారు.ఈ క్రమంలోనే ప్రపంచంలోని ఎత్తైన కట్టడం అయినా బుర్జ్ ఖలీపాను ఎంచుకున్నారు.అనుకున్న విధంగానే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కు వెళ్లారు.బుర్జ్ ఖలీపాపై అర్హతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు జరిపాడు.
ఈ భవంతిపై ఈ రేంజ్లో బర్త్డే పార్టీ జరుపుకున్న మొదటి వ్యక్తి అర్హనే అంటూ ఆమెకు అల్లు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ప్రస్తుతం అర్హ బర్త్డే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే అల్లు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ భరతుడిగా నటిస్తోంది.అంతే కాకుండా ఇందులో స్టార్ హీరోయిన్ సమంతా కూడా నటిస్తోంది.ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.ఇందులో శకుంతల,దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ సందడి చేయనుంది.