అల్లు అరవింద్ నిర్మాతగా వరుస చిత్రాలు నిర్మిస్తున్నారు.గీతాఆర్ట్స్ మరియు గీతాఆర్ట్స్ 2 బ్యానర్లలో వరుసగా చిత్రాలు చేస్తున్నారు.
గీతాఆర్ట్స్ లో పెద్ద సినిమాలను ఒకటి రెండు నిర్మిస్తున్న అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ 2 బ్యానర్లో బన్నీ వాసుతో వరుసగా చిత్రాలను నిర్మించేలా చేస్తున్నాడు.ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలు గీతాఆర్ట్స్ 2 బ్యానర్లో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.
తాజాగా పలాస చిత్ర దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చారు.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదికి గాను గీతా ఆర్ట్స్ రెండు బ్యానర్లలో కలిపి ఏకంగా 20 సినిమాలు నిర్మించాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా సమాచారం అందుతోంది.అందులో అయిదు కోట్ల లోపు బడ్జెట్ సినిమాలు 10 కాగా 20 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలు 8 ఉండబోతున్నాయట.ఇక రెండు సినిమాలు భారీ బడ్జెట్తో ఉంటాయని సమాచారం అందుతోంది.
మొత్తానికి కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నట్లే ఇచ్చి లాభాల బాటలో గీతాఆర్ట్స్ నడవడం అభినందనీయం.
బన్నీ వాసు ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాడు.
పేరు బన్నీ వాసు నిర్మాత అని, కాని మొత్తం వ్యవహారాలు చూసుకునేది అల్లు అరవింద్ అనే విషయం అందరికి తెల్సిందే.బన్నీ వాసు కేవలం మానిటరింగ్ చేయడమే అంటున్నారు.
ప్రతి సినిమా ఒప్పుకోవడం నుండి చివరకు విడుదల తేదీ నిర్ణయించే వరకు అన్ని కూడా అల్లు అరవింద్ బాధ్యత వహిస్తున్నాడట.