మన టాలీవుడ్ లో గత రెండు రోజుల నుండి విభేదాలు బయట పడుతున్నాయి.ఈ అనూహ్య పరిణామాలతో ఒక్కసారిగా టాలీవుడ్ లో వాడివేడిగా వాతావరణం నెలకొంది.
మరి అంత విబేధాలు బగ్గుమనడానికి కారణం ఏంటంటే.నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ అని చెప్పాలి.
వీరిద్దరిపై హాట్ టాపిక్ గా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ప్రెజెంట్ టాలీవుడ్ లో ఈ ఇద్దరు నిర్మాతలు కూడా టాప్ స్థానాల్లో ఉన్నారు.
మరి ఈ టాప్ ప్రొడ్యూసర్స్ మధ్య ఇప్పుడు వివాదం ఏర్పడి అది కాస్త ముదురుతున్నట్టు తెలుస్తుంది.త్వరలోనే ఫిబ్రవరి 18న నిర్మాతల మండలి ఎలక్షన్స్ ఉన్న సమయంలోనే ఇలా జరగడం కలకలం రేపుతోంది.
ఏం జరిగిందో తెలియదు కానీ ఈ వివాదంలోకి ప్రొడ్యూసర్ గిల్డ్ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం.
ఈ నిర్మాతల గిల్డ్ దిల్ రాజు, అల్లు అరవింద్ మధ్య ఉన్న గొడవను చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారని ఎలక్షన్స్ దగ్గర పడే లోపు ఈ వివాదం చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఈ స్టార్ నిర్మాతలు మాత్రం ఒకరిపై ఒకరు పైచేయి సాదించేందుకు చూస్తున్నారట.మరి ఈ వివాదం మొదలవ్వడానికి అసలు కారణం పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో దిల్ రాజు సినిమాను ప్రకటించడం అని తెలుస్తుంది.
ఈ కాంబోలో గీతా గోవిందం సీక్వెల్ రాబోతుంది అని అంతా అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు.అప్పుడే ఈ సినిమా సీక్వెల్ కూడా తీయాలని అరవింద్ వీరిద్దరికి అడ్వాన్స్ కూడా ఇచ్చారని.కానీ వీరు దీనిని పక్కన పెట్టి కొత్తగా దిల్ రాజుతో సినిమా అనౌన్స్ చేయడం వల్లే ఇప్పుడు ఈ వివాదం చోటుచేసుకుంటుంది అని టాక్.
ఈ క్రమంలోనే అల్లు అరవింద్ సీరియస్ అవ్వడంతో నిన్న ప్రెస్ మీట్ కూడా పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు.అంతలోనే నిర్మాతల మండలి రిక్వెస్ట్ మేరకు ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసారని టాక్ వచ్చింది.
మరి చిలికి చిలికి ఈ గాలివాన తుఫానుగా మారుతుందో.లేదంటే తీరం దాటక ముందే ఆగిపోతుందో వేచి చూడాలి.