తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ ఆహా నుండి క్వాలిటీ కంటెంట్ రాబోతుంది.ఇప్పటి వరకు వచ్చింది ఒక లెక్క ఇక నుండి రాబోతున్నది ఒక లెక్క అన్నట్లుగా ఉండబోతుంది.
ఆహా లో వెబ్ సిరీస్ లు మరియు వెబ్ మూవీస్ వరుసగా భారీ బడ్జెట్ తో రాబోతున్నాయి.ఇప్పటి వరకు ఆహాలో వచ్చిన వెబ్ సిరీస్ లు కోటి లోపు బడ్జెట్ తోనే రూపొందాయి.
ఇక వెబ్ మూవీస్ విషయానికి వస్తే యాబైల లక్షలను మించి రాలేదు.కాని ఇకపై వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
వంశీ పైడిపల్లి ఏకంగా మూడు వెబ్ మూవీస్ ను రూపొందించే పనిలో ఉన్నాడు.ఆ మూడు వెబ్ మూవీస్ కు దాదాపుగా అయిదు కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
దానికి తోడు వెబ్ సిరీస్ కు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నాడు.
మారుతి మరియు నందిని రెడ్డిలు కూడా ఆహా కోసం స్క్రిప్ట్ ను రెడీ చేశారు.
అల్లు అరవింద్ దాదాపుగా పాతిక కోట్లను ఖర్చు చేసి భారీ ప్రాజెక్ట్ లను మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది.ఆహా ఒరిజినల్స్ పేరుతో వీటిని నిర్మించబోతున్నారు.ఇవి మాత్రమే కాకుండా అల్లు అరవింద్ కు చెందిన గీతాఆర్ట్స్ 2 బ్యానర్ లో మరియు దిల్ రాజు బ్యానర్ లో కూడా కోటి లోపు బడ్జెట్ తో కొన్ని సినిమాలను నిర్మించి ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం చేస్తున్నారు.మొత్తంగా ఆహా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ లను చేస్తున్నారు.
అమెజాన్ తో పాటు ఇతర ఓటీటీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆహా ను అత్యుతన్నత శ్రేణి కంటెంట్ తో నింపేయాలని భావిస్తున్నారు.