మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్బస్టర్ను అందుకున్నాడు.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్తో తమ బ్యానర్లో వరుసబెట్టి సినిమాలు చేస్తూ స్పీడు పెంచారు.
అయితే అల్లు అరవింద్ ఎప్పటినుండో ఓ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించాలని చూస్తున్నాడు.
అయితే కొన్నేళ్ల క్రితమే ఈ సినిమాను పట్టాలెక్కించాలని ఆయన భావించాడు.కానీ ఎందుకో అది కుదరలేదు.ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్, చరణ్లు కలిసి నటిస్తుండటంతో ఇప్పుడు తన బ్యానర్లోనూ ఓ భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ రెడీ అవుతున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్, మహేష్ బాబులు మల్టీ్స్టారర్ మూవీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు అరవింద్ రెడీ అవుతున్నారు.
అయితే ఈ సినిమా కోసం ఓ పర్ఫెక్ట్ కథను, దాన్ని తెరకెక్కించేందుకు ఓ స్టార్ డైరెక్టర్ను వెతికే పనిలో అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది.
అన్ని అంశాల కుదరగానే ఈ ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడు.మరి తారక్, మహేష్ల మల్టీస్టారర్ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ఆసక్తి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఇక ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందో, ఇందులో నటించే నటీనటులు ఎవరు అనే అంశాలు తెలియాలంటే మాత్రం సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.