మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న మరొ నటుడు వైష్ణవ్ తేజ్.సాయి ధరమ్ తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా శంకర్ దాదా ఎంబీబీఎస్ లో కనిపించాడు.ఇప్పుడు ఉప్పెన సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. సుకుమార్ అందించిన కథతో అతని శిష్యుడు చిట్టిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయ్యి యుట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.ఇక రిలీజ్ కి దగ్గర పడుతున్న సమయంలో లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడిపోయింది.
అప్పటి నుంచి సినిమాకి సంబందించిన ఎలాంటి సమాచారం లేదు.
వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్న సినిమా కావడంతో ఓటీటీ నుంచి ఆఫర్స్ వస్తున్న రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వైష్ణవ్ చేయబోయే సినిమా కూడా కన్ఫర్మ్ అయిపొయింది.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ కుర్ర హీరో రెండో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
ఇప్పటికే కథ కూడా సిద్ధం అయ్యిందని, కరోనా పరిస్థితులు సద్దుమనిగిన తర్వాత అఫీషియల్ గా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుందని సమాచారం.అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 మీద బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తాడా లేక అల్లు అరవింద్ నిర్మిస్తాడా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.
ఎవరు నిర్మించిన ఫ్యామిలీ బ్యానర్ కాబట్టి రెండో సినిమాని వైష్ణవ్ తేజ్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అర్ధమవుతుంది.