ప్రస్తుతం అన్ని భాషల సినీ ఇండస్ట్రీల్లో డిజిటల్ ప్లాట్ఫాంల హవా నడుస్తోంది.కాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఆయన ఇటీవల ‘ఆహా’ అపే ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫాంను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ యాప్కు మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ యాప్లో కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లను కూడా పెట్టనున్నారు.దీంతో వీటిని తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ చాలా పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్తో కలిసి పలు వెబ్ సిరీస్లను తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ రెడీ అవుతున్నారు.దీంతో మెగా ప్రొడ్యూసర్ తెరకెక్కించబోయే వెబ్ సిరీస్లు ఎలా ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే మెగా ప్రొడ్యూసర్ ట్రెండ్కు తగ్గట్టుగా వెబ్ సిరీస్లను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.క్రిష్ కూడా తనదైన స్టయిల్లో ఈ వెబ్ సిరీస్లను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.