అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.ఆహా కోసం కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్న సమయంలో కరోనా లాక్ డౌన్ వచ్చి పూర్తిగా షూటింగ్స్ ఆగిపోయాయి.
ఈ లాక్డౌన్ టైంలో ఆహా కోసం ఎన్నో స్క్రిప్ట్లు వినడంతో పాటు కొన్ని షోల కోసం కాన్సెప్ట్లు కూడా విన్నాడట.ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి సినిమాల కంటే కూడా అధికంగా ఆహాపైనే దృష్టి పెట్టాడట.
జూమ్ యాప్ ద్వారా కొన్ని వందల కథలను చర్చించారట.
పదుల సంఖ్యలో కథలు ఫైనల్ చేయడంతో పాటు త్వరలో షూటింగ్కు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం షూటింగ్స్కు అనుమతించిన నేపథ్యంలో వెంటనే మూడు వెబ్ సిరీస్లను మరియు ఒక వెబ్ మూవీని నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేశాడు.
అన్ని కూడా చాలా తక్కువ బడ్జెట్తోనే నిర్మించబోతున్నారు.ఇవన్నీ కూడా కేవలం కోటి లోపు బడ్జెట్తో పూర్తి చేయబోతున్నారు.
ఈ కష్టకాలంలో సినిమాలను నిర్మించడం కంటే ఓటీటీ కంటెంట్ను నిర్మించడం బెటర్ అంటూ చాలా మంది నిర్మాతలు అనుకుంటున్నారు.అదే అల్లు అరవింద్ కూడా చేస్తున్నారు.భారీ ఎత్తున వెబ్ సిరీస్లు నిర్మాణం అవుతున్న క్రమంలో ఆహా వెబ్ సిరీస్లు చాలా యూనిక్గా ఉంటేనే ప్రేక్షకులు ఆధరిస్తారనే విషయాన్ని గుర్తించాలి.అందుకు అల్లు అరవింద్ చాలా కృషి చేయాల్సి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.