ఇంగ్లండ్ లో చదువు పేరిట వెళ్లి బుద్దిగా చదువుకోకుండా పెడసరి బుద్దితో చెలరేగిపోయాడు .అయితే అత్యాచారం లేకుంటే తీవ్రంగా బదితురాళ్ళను గాయపరచడం వంటి తప్పుడు పనులనే విద్యగా నేర్చుకుని షూట్ ఎట్ అరెస్టు ఆర్డర్స్ పొంది పారిపోయి భారత్ వచ్చేసాడు .
వరుసపెట్టి లైంగిక నేరాలకు పాల్పడి ఎప్పటినుంచో తప్పించుకు తిరుగుతున్న సీరియల్ రేపిస్టును ఢిల్లీలో క్రైం బ్రాంచి పోలీసులు ఇంటర్పోల్ సూచనలు మేరకు అరెస్టు చేశారు.భారత జాతీయుడైన రామీందర్ సింగ్ (28)పై స్కాట్లండ్ లో చదువు గాలికి వదిలేసి లైంగిక దాడి, హత్యాయత్నం కేసుల పాల్పడ్డాడు .అతడు ఢిల్లీలో తచ్చాడుతుంటే క్రైమ్ బ్రాంచ్ పట్టుకుని అరెస్టుచేసింది.ఇంగ్లండ్ లో చదువుకోడానికి వెళ్లిన రామీందర్ సింగ్,అక్కడ నీచానికి దిగజారాడు .ఒకామెను నమ్మించి నిర్మానుష్యంగా ఉన్న పార్కుకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.ఆమె తిరగబడేసరికి ఆమె ముఖం పిగలేసాడు.
అరెస్టు భయంతో అక్కడి నుంచి తప్పించుకుని చండీగఢ్ వచ్చేసి నకిలీ పేరుతో చలామణి అయ్యాడు.ఇంగ్లండ్ ప్రభుత్వం అతడిపై ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారి చేసింది .