పార్లమెంటు లాబీలో ఎంపీ పై బెదిరింపు ఆరోపణలు.. ?

పలు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో వివాదస్పద ఘటనలు చోటు చేసుకోవడం కామన్‌గా మారిపోయింది.ఈ నేపధ్యంలో తాజాగా మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన హోంమంత్రి వసూళ్ల ఆరోపణల కేసుపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లగా, మరో సంచలన విషయం బయటకు వచ్చింది.

 Allegations Of Intimidation Against Mp In Parliament Lobby Maharashtra, Parliam-TeluguStop.com

సాక్షాత్తు పార్లమెంటు లాబీల్లోనే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించాడని ప్రముఖ సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో మరోసారి పొలిటికల్ హీట్ రాజుకుంది.కాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గానూ సావంత్, తనను బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపిస్తూ, ఈ విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారట.

Telugu Maharashtra, Lobby-Latest News - Telugu

ఈమేరకు నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తాను.నేను తలుచుకుంటే నిన్ను జైళ్లో కూడా పెట్టిస్తానని అన్నాడని స్పీకర్‌కు రాసిన లేఖలో నవనీత్ పేర్కొన్నారు.ఈ క్రమంలో నవనీత్ మాట్లాడుతూ, సావంత్ బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానకరమని, ఇలాంటి ఘటనలపై తక్షణమే స్పందిస్తే మరోసారి పునరావృతం కాకుండా ఉంటాయని వెల్లడించారు.,/br>

అయితే ఈ ఆరోపణల విషయంలో స్పందించిన అరవింద్ సావంత్ ఇలా బెదిరింపులకు దిగవలసిన అవసరం తమకు లేదని కావాలంటే లాబీల్లో సీసీటీవీ ఫుటేజీలు చెక్ చేసి వాస్తవాలను తేల్చాలని పేర్కొనడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube