మంత్రి మల్లారెడ్డి అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మధ్య తగ్గపోరు నడుస్తున్న సంగతి తెలిసిందే.అయితే మొన్నటికి మొన్న జరిగిన ఇద్దరి సంభాషణ వింటే వీరి మధ్య వైరం ఇప్పటిది కాదని టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఈ వైరం ఉందని చర్చించుకుంటున్నారు పలువురు అయితే ఈ విషయాలను బయట పెట్టింది రేవంత్ కాదు ఏకంగా మంత్రి మల్లారెడ్డి.
కాగా ఆయన మొన్న రెండోసారి ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా ఉన్నాయి.ఎందుకంటే ఆయన మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడారు.
ఇక ఆయన్ను రేవంత్ రెడ్డి గతంలో /em>కూడా ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారని, ఇక ఇప్పుడు కూడా మళ్లీ చేస్తున్నారంటూ చెప్పారు.ఇక్కడే ఆయన మరో విషయం మాట్లాడుతూ తాను బ్లాక్ మెయిల్ కు లొంగిపోయే వ్యక్తిని కామెంట్ చేశారు.
టీడీపీలో ఉన్నప్పుడు అసలు ఏం జరిగిందో అది పెద్దగా బయటకు రాలేదు కాబట్టి ఎవరికీ తెలియదు.కానీ ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు.ఇక ఆయన టీఆర్ ఎస్ లో చేరి ఎంపీగా గెలిచిన తర్వాత కూడా రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పడమే అస్సలు నమ్మేట్టేగా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు అధికారపార్టీలో ఉంటూ మంత్రి హోదాలో ఉన్న సందర్భంలో ఆయన ఒక్క ఫిర్యాదు చేస్తే మిగిలిన విషయాలను పోలీసులే చూసుకునే వారు కదా.ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న వారికంటే ప్రతిపక్షాల వారికి ఎక్కువ అధికారాలు ఉంటాయా.ఇక కేసీఆర్కు కూడా రేవంత్ అంటే అస్సలు పడదని తెలిసిన సమయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉంటారు.
బ్లాక్ బెయిలింగ్ చేస్తున్నట్టు ఇంతకుముందే కేసీఆర్కు చెప్తే ఆయన చూసుకుంటారు కదా.ఇవన్నీ కాకుండా కేవలం మాటలు చెప్పడంతో ఆయన ఆరోపనలు ఎవరూ నమ్మేట్లుగా లేదంటున్నారు.