టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత కామెడీ చిత్రాల హీరోగా అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.తెలుగులో కామెడీ సినిమాలు అంటే అల్లరోడు పేరు ప్రముఖంగా వినిపించేలా చేసుకున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో అతని కామెడీ టైమింగ్ కి తెలుగు ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కావడం లేదు.కథలో భాగంగా కామెడీ వచ్చే చిత్రాలని ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు తప్ప ప్రత్యేకంగా కామెడీతోనే సినిమా వస్తే దానిని పెద్దగా రిసీవ్ చేసుకోవడం లేదు.
దీంతో అల్లరి నరేష్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.ఈ నేపధ్యంలో మహర్షి లాంటి సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర చేశాడు.
దీంతో స్పెషల్ రోల్స్ కి కూడా తను రెడీగా ఉన్నాననే గ్రీన్ సిగ్నల్ దర్శకులకి ఇచ్చాడు.
ఇదిలా ఉంటే తన కెరియర్ లో మొదటి సారి జోనర్ మార్చి నాంది అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.
లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి వస్తానని నరేష్ బలంగా చెబుతున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియాలో డిజిటల్ ప్లాట్ ఫాంల హవా మొదలైంది.అన్ని భాషలలో వెబ్ సిరీస్ లు స్టార్ట్ అయ్యాయి.
దీంతో తను కూడా వెబ్ సిరీలలో నటించాలని ఆశ పడుతున్నాడు.ఈ విషయాన్ని తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో నరేష్ వ్యక్తం చేశాడు.
అయితే ఎ జోనర్ లో అల్లరోడు వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా ‘అల్లరి’ నరేశ్ తనదైన ముద్ర వేశాడు.
ఆయన చేసిన ‘బంగారు బుల్లోడు’ ప్రేక్షకుల ముందుకు రావలసి వుంది.ఇక ‘నాంది’ చిత్రం ఇంకా చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి వుంది.
లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలుకానుంది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .‘నాంది’ చిత్రం నా కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావిస్తున్నాను.ఈ సినిమా నాకు తప్పకుండా మంచి హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాను.
హీరోగా మళ్లీ నేను బిజీ అవుతాననే నమ్మకం ఏర్పడింది.మొదటి నుంచి ఎక్కువగా హాస్య పాత్రలు చేస్తూ రావడం వలన, ఇతర ముఖ్యమైన పాత్రలకు ఎవరూ పిలవడం లేదు.
కానీ నాకు నెగెటివ్ కేరక్టర్లు చేయాలని కూడా వుంది.అంతేకాదు వెబ్ సిరీస్ లలోను నటించడానికి నేను సిద్ధంగానే వున్నాను” అని చెప్పుకొచ్చాడు
.