రాజేంద్రప్రసాద్ తర్వాత టాలీవుడ్ లో ఆ స్థాయిలో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్.సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చేసుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం కామెడీ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉన్నాడు.
అయితే చాలా కాలంగా ఆయన చేస్తున్న కామెడీ సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు.కనీసం కలెక్షన్ కూడా రాబట్టలేకపోతున్నాయి.
కంటెంట్ బేస్ కామెడీకి ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.అయితే అల్లరి నరేష్ సినిమాలలో ఆ బలమైన కంటెంట్ మిస్ కావడంతో కామెడీ కూడా మిస్ ఫైర్ అవుతుందనే అభిప్రాయం వినిపిస్తుంది.
ఈ నేపధ్యంలో ఈ హీరో కూడా కాస్తా జోనర్ మార్చి సినిమాలు చేస్తున్నాడు.తన మీద ఉన్న మార్క్ ని చెరుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ నేపధ్యంలో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో సీరియస్ గా సాగే ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించాడు.
మహర్షి సినిమాకి ఆ పాత్రనే జీవం పోస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అల్లరోడు బంగారు బుల్లోడు అనే కామెడీ సినిమా ఒకటి, నాంది అనే సీరియస్ కంటెంట్ సినిమా ఒకటి చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.
ఈ నేపధ్యంలో వీటికి అమెజాన్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.తన సినిమాలని లేట్ అయిన థియేటర్ లోనే రిలీజ్ చేస్తానని గతంలో అల్లరి నరేష్ చెప్పాడు.
అయితే ప్రస్తుత పరిస్థితిలో థియేటర్లు ఓపెన్ చేసిన 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రం పర్మిషన్ ఉంది.ఒక వేళ ఇదే స్థితిలో సినిమా రిలీజ్ చేస్తే నిర్మాతలు భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
దీనిని దృష్టిలో ఉంచుకొని థియేటర్ లో రిలీజ్ కంటే ఒటీటీ బెటర్ అనే అభిప్రాయంతో అల్లరి నరేష్ కాస్తా వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో అమెజాన్ వాళ్ళు అల్లరి నరేష్ సినిమాలు ఒక్కో దానికి ఎనిమిది కోట్లు ఆఫర్ చేసి కోనేసుకున్నారని తెలుస్తుంది.