కెరియర్ ఆరంభం నుంచి ఎక్కువగా కామెడీ చిత్రాలు మాత్రమే చేస్తూ వచ్చిన అల్లరి నరేష్ మధ్య మధ్యలో కాస్తా డిఫరెంట్ కథలు ట్రై చేసాడు.అయితే అవి అతనికి నటుడుగా గుర్తింపు తీసుకొచ్చాయి తప్ప కెరియర్ పరంగా హెల్ప్ కాలేదు.
అలాగని కామెడీ సినిమాలు కూడా ఒకే మూసలో వెళ్ళడం వలన పెద్దగా ఆడియన్స్ ని కనెక్ట్ కాలేదు.దీంతో అల్లరి నరేష్ కంప్లీట్ గా రూట్ మార్చేసి నాంది సినిమాతో సీరియస్ సబ్జెక్టు వైపు వచ్చాడు.
ఈ సినిమా అద్బుతమైన హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు మంచి కలెక్షన్ రాబట్టింది.అలాగే అల్లరి నరేష్ కి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ మూవీ హిందీలోకి కూడా రీమేక్ అవుతుంది అంటే ఏ రేంజ్ లో విజయం సొంతం చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక సినిమాలో అల్లరి నరేష్ నటనకి కూడా మంచి ప్రశంసలు లభించాయి.ఇదిలా ఉంటే అల్లరి నరేష్ నెక్స్ట్ సినిమా విషయంలో కామెడీని నమ్ముకోకుండా సీరియస్ సబ్జెక్టు తోనే వెళ్తున్నాడు.పూరీ జగన్నాథ్ దగ్గర పనిచేసిన సతీష్ చెప్పిన ఓ ఇంటరెస్టింగ్ స్టొరీ లైన్ కి నరేష్ ఒకే చెప్పాడు.
ఈస్ట్ కోస్ట్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుంది.త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.కథలో కొత్తదనం ఉండటంతో పాటు కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.అలాగే లైటర్ వేలో కథలో భాగంగా కామెడీ ఉంటుందని టాక్.
దీనిని బట్టి అల్లరి నరేష్ ఇకపై పూర్తిగా కామెడీ చిత్రాలని వదిలేసి తనపై కామెడీ హీరో అనే ముద్రని చెరిపెసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది.