టాలీవుడ్ లో కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు అల్లరి నరేష్.కేరళలో కామెడీ ఎంటర్టైనర్ సినిమాలకి రాజేంద్రప్రసాద్ తర్వాత తానే బెస్ట్ ఛాయిస్ అనిపించుకున్న అల్లరి నరేష్ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లను తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో అల్లరి నరేష్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది అని చెప్పాలి.ఇదిలా ఉంటే కేవలం షోలో హీరోగానే కాకుండా అల్లరి నరేష్ అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేస్తూ ఉంటాడు.
అతని కెరీర్లో లో హీరోగా చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే గమ్యం సినిమాల్లో చేసిన పాత్ర మరొక ఎత్తు అని చెప్పాలి.తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర చేశాడు.
మహర్షి సినిమాలో అల్లరి నరేష్ చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ కామెడీ హీరో మరోసారి మాస్ మహారాజ్ రవితేజతో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ప్రస్తుతం డిస్కో రాజా సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ముందుగా సునీల్ ని అనుకున్న కానీ ఏవో కారణాల వల్ల అతని స్థానంలో ఇప్పుడు ఆ పాత్ర కోసం అల్లరి నరేష్ ని దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అల్లరి నరేష్ రవితేజతో కలిసి శంభో శివ శంభో సినిమాలో కలిసి నటించాడు.మళ్లీ చాలా గ్యాప్ తర్వాత మరోసారి డిస్కో రాజా సినిమా తో రవితేజతో కలిసి ఇ సందడి చేయనున్నారు.