టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ చిత్రాల హీరోగా ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్.దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ కెరియర్ లో తండ్రితో చేసిన సినిమాలు అతనికి కామెడీ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాయి.
అయితే ఆ తరువాత తండ్రి చనిపోవడం అతను చేసిన కామెడీ చిత్రాలు అన్ని ఒకే మూసలో ఉండటంతో పాటు అతను చేసిన రొటీన్ కామెడీకి ప్రేక్షకులు విసిగిపోయి కథలో భాగంగా కామెడీని కోరుకునే సినిమాలు వచ్చేయడంతో వరుస ఫ్లాప్ లతో ఉన్నాడు.గత కొన్నేళ్ళుగా అతను చేసిన కామెడీ సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ టాక్ నే తెచ్చుకున్తున్నాయి.
దీంతో ఒక్కసారిగా అతని మార్కెట్ మొత్తం పడిపోయింది.
ప్రస్తుతం ఇప్పుడున్న యువ హీరోలలో తక్కువ మార్కెట్ ఉన్న హీరో అంటే అల్లరి నరేష్ మాత్రమే.
ఇలాంటి పరిస్థితిలో తనని తాను మార్చుకొని కొత్తదనం ఉన్న కథలకి రావాల్సిన అవసరం ఉందని భావించిన నరేష్ కంప్లీట్ జోనర్ మార్చేసి నాంది అనే సినిమాని ఎనౌన్స్ చేశాడు.ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లో పోలీస్ స్టేషన్ లో తలక్రిందులుగా కట్టేసి ఒళ్లంతా దెబ్బలతో ఉన్న నరేష్ లుక్ ని వదిలారు.
ఈ లుక్ తో సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పేశారు.ఇదిలా ఉంటే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని తాజాగా మొదలెట్టారు.విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలక పాత్ర చేస్తుంది.పోస్టర్ తో అంచనాలు పెంచుకున్న ఈ సినిమాతో అయిన నరేష్ హిట్ కోడతాదేమో వేచి చూడాల్సిందే.
.