ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.ఆయన వారసులు అయిన ఆర్యన్ రాజేష్ మరియు అల్లరి నరేష్లు హీరోలుగా పరిచయం అయ్యారు.
ఆర్యన్ రాజేష్కు హీరోగా మంచి భవిష్యత్తు ఉందని అంతా భావించారు.కాని ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దగా నెగ్గుకు రాలేక పోయాడు.
అల్లరి నరేష్ హీరో అవుతాడని ఎవరు భావించలేదు.కాని ఆయనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.కామెడీ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న అల్లరి నరేష్ మినిమం గ్యారెంటీ హీరో అంటూ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు
మినిమం గ్యారెంటీ హీరో కాస్త వరుస ఫ్లాప్లతో దిగజారి పోయి తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు.ఆయన సినిమాల ఎంపిక మరియు దర్శకుల ఎంపిక తప్పిదాల వల్ల ‘సుడిగాడు’ తర్వాత ఇప్పటి వరకు సక్సెస్ను దక్కించుకోలేక పోయాడు.ఏమాత్రం ఆకట్టుకోని సినిమాలను చేస్తూ అల్లరోడు తన మార్క్ను దూరం చేసుకున్నాడు.ప్రేక్షకులు కూడా అల్లరోడి సినిమా అంటే లైట్ తీసుకునే స్థాయికి వచ్చేశారు.ఈ సమయంలోనే అల్లరి నరేష్ రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు.ఆ రెండు సినిమాల్లో కూడా ఈయన వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.
తమిళంలో సుడిగాడు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతుంది.ఆ తమిళ సీక్వెల్ను తెలుగులో భీమినేని శ్రీనివాస్ రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు.అల్లరి నరేష్తో పాటు సునీల్ను కూడా నటించబోతున్నాడు.సునీల్, అల్లరి నరేష్లది సమానమైన పాత్ర అంటూ సమాచారం అందుతుంది.
అల్లరి నరేష్ మంచి కథలను ఎంపిక చేసుకోవడంలో విఫలం అవుతున్నాడని, అందుకే ఆయన కెరీర్ ఇలా అర్థాంతరంగా ముగింపుకు వచ్చిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.హీరోగా ఇక అవకాశాలు రావని భావిస్తున్నాడో ఏమో కాని క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఓకే చెబుతున్నాడు
మహేష్బాబు 25వ చిత్రంలో అల్లరి నరేష్ ఒక సాదారణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఆ సినిమాలో అల్లరి నరేష్ పేదవాడిగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ధనికుడైన మహేష్బాబు స్నేహితుడిగా పేదవాడి పాత్రలో అల్లరి నరేష్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.
ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే అల్లరి నరేష్ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం మాత్రం ఆయన స్థాయికి తగినది కాదు అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇకపై అల్లరోడు ఇలాగే కంటిన్యూ అవుతాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.