టాలీవుడ్లో కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యక గుర్తింపును తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయాడు.అయితే సినిమాల ఎంపికలో రొటీన్ కథలే ఉండటంతో అల్లరి నరేష్ వరుసగా ఫ్లాపులను మూటగట్టుకున్నాడు.
దీంతో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రావడం ఆపేశారు.కాగా ఫేడవుట్ అవుతున్న సమయంలో అల్లరి నరేష్ క్యారెక్టర్ పాత్రలకు ఓకే చెప్పి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చిత్రంలో నటించాడు.
ఇది ఆయనకు బాగా కలిసొచ్చిందని చెప్పాలి.కాగా ప్రస్తుతం అల్లరి నరేష్ నాంది, బంగారు బుల్లోడు అనే రెండు సినిమాలను రిలీజ్కు రెడీ చేశాడు.ఈ రెండు సినిమాలు కూడా వేరే కథలతో వస్తుండటంతో ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే నాంది చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుండగా, బంగారు బుల్లోడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగ బరిలో రిలీజ్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం సస్పెన్స్గా మారింది. ఇక ఈ సినిమాను ఫుల్టూ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించింది.ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.అల్లరి నరేష్ సరసన ఈ సినిమాలో పూజా జవేరీ హీరోయిన్గా నటిస్తోండగా పివి గిరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.అనిల్ సుంకర ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే సంక్రాంతి బరిలో పలు బడా చిత్రాలు పోటీ పడుతుండగా ఇప్పుడు అల్లరోడు కూడా పోటీకి దిగుతున్నాడు.మరి సంక్రాంతి పండుగకు ఇతర హీరోలతో పోటీ పడతాడా లేక తన సినిమాను వాయిదా వేసుకుంటాడా అనేది చూడాలి.