అంగ రంగ వైభవంగా జపాన్ రాజధాని టోక్యోలో ఒలంపిక్ క్రీడలు స్టార్ట్ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఇండియా దేశానికి చెందిన క్రీడాకారులు వేదికపైకి రాగానే.
ప్రధాని మోడీ చప్పట్లతో స్వాగతం పలికారు.తన కార్యాలయంలో టీవీలో దీక్ష చేస్తున్న సమయంలో.
భారత్ క్రీడాకారులు వచ్చిన వెంటనే లేచి నుంచుని చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలిపారు.సోషల్ మీడియాలో “అందరూ చీర్స్ మరి ఇండియా చేద్దాం రండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇండియా తరఫున 119 ప్లేయర్స్ టోక్యో ఒలంపిక్స్ లో పోటీ పడుతున్నారు.67 మంది పురుషులు 52 మంది మహిళలు ఉన్నారు.ఆగస్టు 8వ తేదీ వరకు ఈ ఒలంపిక్ క్రీడలు జరగనున్నాయి.
ఇక ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ట్విటర్లో టోక్యో భారత్ ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
సంపూర్ణమైన విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.దేశం మొత్తం గర్వించేలా ఒలంపిక్ భారత అథ్లెట్ క్రీడాకారులు రాణిస్తారని చరిత్రాత్మక క్షణాలని సరికొత్తగా ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు విఆర్ టీమిండియా అంటూ పోస్ట్ పెట్టారు.
ఇదే రీతిలో మెగాస్టార్ చిరంజీవి టోక్యో ప్రారంభమైన అంతర్జాతీయ క్రీడోత్సవం ఒలంపిక్స్ లో పోటీపడుతున్న ఇండియా టీం కి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.తమ అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించి దేశానికి గర్వకారణం కావాలని కోరుకుంటున్నట్లు స్వర్ణ పథకాలతో తిరిగి దేశానికి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.