ప్రపంచం సరికొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతుంది.రోజుకో కొత్త టెక్నాలజీ వస్తుంది.
ఇంకా ఏమైనా సాధించాల .కొత్తగా ఆలోచించాలి అని పోటాపోటితో ముందుకువెళ్తున్నారు.అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు.ఇప్పటికి క్షద్రపూజలు చేయడం కలకలం రేపుతున్నాయి.మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.టెక్నాలజీ మారుతున్నా కొందరు మాత్రం మూఢనమ్మకాలను ఇంకా నమ్ముతున్నారు.
అయితే ఇవి కొందరి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.జీవితాలను నాశనం చేస్తున్నాయి.
ప్రాణాలు పోతున్నా మూఢనమ్మకాలను మాత్రం మానడం లేదు.ఇది వరకు ఈ నమ్మకాల వల్లే ఇంట్లో వల్లనే చంపుకోవడం కలకలం రేపింది.
ఎందుకు ఇవ్వన్నీ చేస్తున్నారు అంటే ఇది మా ఆచారం అంటూ ఈ నమ్మకాలను పాటించేవారు చాలా మంది ఉన్నారు.అయితే ఇప్పుడు మరో మూఢనమ్మకం అందరిని షాక్ కి గురిచేస్తుంది.
అలాంటి మూఢనమ్మకంలో ఒకటి రాక్షస వివాహం.ఈ వివాహాలు ఇండోనేషియా’లోని సుంబా దీవిలో జరుగుతున్నాయి.అయితే ఇక్కడ విషయం ఏంటంటే వివాహం అంటే అమ్మాయికి, అబ్బాయికి నచ్చితే జరిగేది.కానీ ఇక్కడి ఆచారం అలా కాదు.
ఈ వివాహాలు అమ్మాయిలకు ఇష్టం ఉండవు.ఈ వివాహాలు అబ్బాయిలు బలవంతంగా చేసుకున్నవే.
ఈ దురాచారం అక్కడ ‘కవిన్ టాంగాప్’ అనే పేరుతో కొనసాగుతున్నది.అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు కిడ్నాప్ చేసి మరి పెళ్లిచేసుకుంటాడు.
వీళ్ళ ఆచారాలు చాలా విచిత్రంగా ఉంటాయి.వీరు మరపు అనే ప్రాచీనమతాన్ని కూడా ఆచరిస్తారు.
వస్తువలకి ప్రాణం ఉందని వీళ్ళ నమ్మకం.నీళ్లు నుదుటిని తాకితే ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదనేది వీరి విశ్వాసం.
అందుకే నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంట్లోకి బలవంతంగా లాక్కెళ్లి తలకు నీళ్లు తాకిస్తారు.ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోడానికి అవసరం అయితే బంధువులతో కలిసి అమ్మాయి ఇంటి మీదికి దండయాత్రకూ వెళ్తాడు.
ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తనతో తీసుకెళ్తాడు.అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే కిడ్నాప్ అనంతరం అదే వ్యక్తికి ఆ మహిళ ను ఇచ్చి వివాహం చేస్తారు.
ఒకవేళ ఆ అమ్మాయికి వివాహం నచ్చకపోయినా కూడా ఎవ్వరు ఆపారు.వివాహం చేసుకోవాల్సిందే.
కాపురం చేయాల్సిందే.కిడ్నాప్ తరువాత అమ్మాయి తప్పించుకున్న సంఘటనలు చాలా తక్కువ.
ఎందుకంటే పెళ్లి అయిపోయాక ఆ ఇంట్లో నుంచి అమ్మాయి వస్తే వారికి విలువ ఉండదు.ఈ భయంతోనే కిడ్నాప్ చేసిన వారినే పెళ్లిచేసుకుంటారు.
అయితే ఒక అమ్మాయి ఈ ఆచారం నుంచి తప్పించుకొని తనకి నచ్చిన వాడిని చేసుకుంది.సుంబాలో ఓ యువతి స్వచ్ఛంద సంస్థ నడుపుతుంది.అయితే ఆమెను తన తండ్రి బంధువులే ఒక రోజు కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా కారు ఎక్కించారు.కారు వరుడు ఇంటి ముందుకు వెళ్ళగానే పెద్దగా గంటలు మోగించి, మంత్రాలు చదువుతూ ఆ యువతిని ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు.
అయితే ఆ అమ్మాయి అతి కష్టం మీద ఈ విషయాన్నీ తల్లితండ్రులకు, స్నేహితులకు మెసేజ్ చేసింది.అయితే ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలనే కిడ్నాప్ చేశామని ఎంత చెప్పిన ఆ అమ్మాయి వినలేదు.
ఆరు రోజులపాటు తనని తాను రక్షించుకుంది.విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు రంగంలోకి దిగాయి.
చర్చలు జరిపాయి.అందరు కలిసి ఆ యువతిని విడిపించారు.
ఆ తరువాత ఆ అమ్మాయి తనకి నచ్చిన అబ్బాయిని వివాహం చేసుకుంది.ఎలాంటి కఠిన చర్యలు లేకపోవడమే ఈ దురాచారానికి కారణమని.
మహిళా సంఘాలు విరుచుకుపడ్డారు.అందుకే ఇటువంటి వింత ఆచారాల విషయంలో ఇండోనేషియా ప్రభుత్వం కూడా ప్రోత్సహించకుండా చర్యలు తీసుకునేలాగా ఇండోనేషియా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.