విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఓ పదిమంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు, ఈ మేరకు కేంద్ర పెద్దలతో మంతనాలు కూడా పూర్తయ్యాయి.ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకురావడం వలన గంటాకు కీలక పదవి దక్కబోతోంది అంటూ కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.
టీడీపీలో ఉండేవారు ఎవరు వెళ్లేవారు ఎవరు అనే విషయం మీద కూడా టీడీపీ ఇప్పటికే ఆరా కూడా తీసింది.కానీ ఇంకా ఆ హాడావుడి మొదలవ్వలేదు.
తాజాగా ఇదే విషయమై ఏపీ బీజేపీ కీలక నేత మాజీ ఎంఎల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలోకి చేర్చుకునేందుకు బిజెపి సిద్ధమవుతున్నందున టీడీపీ అసెంబ్లీలో తన ఉనికిని కోల్పోతుందని, మొత్తం 22 మంది శాసనసభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమంటూ మీడియా ముందు చెప్పారు.బాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని, మరోసారి టీడీపీని అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో తప్పక గెలుస్తుంది.రానున్న రోజుల్లో మరింత బలపడి తమ సత్తా ఏంటో చుపిస్తామంటూ సోము వీర్రాజు చెప్పారు.ఇకపై బీజేపీలోకి వలసలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన అన్నారు.