టీడీపీ ఎమ్మెల్యేలంతా బీజేపీలోకి వచ్చేస్తున్నారా ?

విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఓ పదిమంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారు, ఈ మేరకు కేంద్ర పెద్దలతో మంతనాలు కూడా పూర్తయ్యాయి.ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకురావడం వలన గంటాకు కీలక పదవి దక్కబోతోంది అంటూ కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.

 All Tdp Mlas Ready To Join In Bjp-TeluguStop.com

టీడీపీలో ఉండేవారు ఎవరు వెళ్లేవారు ఎవరు అనే విషయం మీద కూడా టీడీపీ ఇప్పటికే ఆరా కూడా తీసింది.కానీ ఇంకా ఆ హాడావుడి మొదలవ్వలేదు.

తాజాగా ఇదే విషయమై ఏపీ బీజేపీ కీలక నేత మాజీ ఎంఎల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలోకి చేర్చుకునేందుకు బిజెపి సిద్ధమవుతున్నందున టీడీపీ అసెంబ్లీలో తన ఉనికిని కోల్పోతుందని, మొత్తం 22 మంది శాసనసభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమంటూ మీడియా ముందు చెప్పారు.బాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని, మరోసారి టీడీపీని అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు.2024 ఎన్నికల్లో బీజేపీ ఏపీలో తప్పక గెలుస్తుంది.రానున్న రోజుల్లో మరింత బలపడి తమ సత్తా ఏంటో చుపిస్తామంటూ సోము వీర్రాజు చెప్పారు.ఇకపై బీజేపీలోకి వలసలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube