ఏపీ రాజకీయాలు రహస్య మిత్రులు, రహస్య కూటములులతో కొత్త రకం రాజకీయ వ్యూహాలు, రాజకీయ విమర్శలు కనిపిస్తున్నాయి.వినిపిస్తున్నాయి.
మూడు పార్టీలు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఎవరికి వారు రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం మామూలుగా జరిగేదే.కాని ఈ సారి ప్రజలని నమ్మించడానికి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలలో ఉన్న నెగిటివ్ ఓటు బ్యాంకుని సొంతం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.
ముఖ్యంగా బీజేపీ మీద ఉన్న వ్యతిరేకతని టీడీపీ లాగాలని ట్రై చేస్తూ ఉంటే, టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతని వైసీపీ సొంతం చేసుకోవాలని చూస్తుంది.రహస్య మిత్రులు అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాయి.
ముఖ్యంగా ఏపీలో విభజన హామీలని అమలు చేయని బీజేపీ మీద ప్రజలకి కోపం ఉంది.దీంతో బీజేపీకి వైసీపీ రహస్య మిత్రుడు అనే విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్తే అది తమకి అనుకూలంగా మారుతుంది అని టీడీపీ భావిస్తుంది.
అలాగే ఐదేళ్ళ పాలనలో అవినీతి, అరాచకం టీడీపీ పార్టీలో ఎక్కువైపోయింది అనే విమర్శలు ఉన్నాయి, దీంతో టీడీపీ, జనసేనకి బంధం ముడిపెట్టి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన వైపు వెళ్ళకుండా ఆపాలని వైసీపీ భావిస్తుంది.దీంతో వారి రహస్య పొత్తుని తెరపైకి తీసుకొచ్చాయి.
అయితే ఈ రహస్య పొత్తులపై జరుగుతున్నా రాజకీయ విమర్శలు ప్రజనలని ఆలోచనలో పడేస్తున్నాయి.అయితే ఈ రహస్య పొత్తులు అనే విషయం ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపించిన ప్రజలలో ఏ పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది అనే దాని బట్టి గెలుపు టీడీపీ, వైసీపీ, జనసేన లో ఒకరి వైపు ఉంటుంది.