టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ చిత్రాలను కూడా ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ క్రమంలో టాలీవుడ్లో చాలా కాలంగా మహేష్ బాబు ఓ సెన్సేషనల్ డైరెక్టర్తో సినిమా చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ సినిమా చేస్తూ చూడాలని చాలా మంది కోరుతున్నారు.
అయితే ఇదే విషయాన్ని రాజమౌళి గతంలో అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశాడు.ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు జక్కన్న ప్రకటించాడు.
అయితే అప్పటినుండి ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు షికారు చేస్తున్నాయి.
మహేష్ బాబు కోసం జక్కన్న మైథలాజికల్ కథను తీయబోతున్నాడని, ఒకవేళ అది కుదరకపోతే కౌబాయ్ కథను తీయడం ఖాయమని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇవన్నీ కేవలం గాలివార్తలేనని స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి ఇంకా కథ పూర్తికాలేదని, ఈ కథ పూర్తయ్యాక తామే అఫీషియల్గా ప్రకటిస్తామని ఆయన అన్నారు.
దీంతో జక్కన్న-మహేష్ సినిమాకు సంబంధించిన వార్తలన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయింది.