ఈ రోజు ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తూనే… తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల తూటాలు వదిలారు.కేసీఆర్ ఎన్ని కుతంత్రాలు చేసినా సరే … కూటమి చేతిలో టీఆర్ఎస్ ఓడడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతే కాదు … ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ గెలవాలంటూ… టీఆర్ఎస్ పార్టీతో పాటు … ఎంఐఎం లు బలంగా కోరుకుంటున్నాయి అంటూ విమర్శలు చేశారు.ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా … ప్రారంభించిన మిషన్ భగీరధ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేసాడు.
పాత వాటర్ ట్యాంకర్ లకే రంగులేసి మిషన్ భగీరథ అంటున్నారని.ప్రాణహిత చేవేళ్ల ను కాళేశ్వరంగా మార్చి వేల కోట్ల రూపాయలను ఆదనంగా ఖర్చు చేశారని దుయ్యబట్టారు.ఇక ఈ విమర్శలు గురించి పక్కన పెట్టి రాహుల్ వరాల గురించి మాట్లాడుకుంటే… ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ప్రతి మండలానికి ఒక 30 పడకల ఆసుపత్రి కట్టిస్తామని… డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని… నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఏర్పాటు చేసతామంటూ రాహుల్ తన ప్రసంగంలో ప్రకటించారు.