బ్యాంక్ ఉద్యోగులు తమ యూనియన్ తరపున సమ్మెకు పిలుపునిచ్చారు.విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలను విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.
దాదాపు 9 యూనియన్లు ఇచ్చిన సమ్మె పిలుపుతో బుధవారం బ్యాంకులు మూతబడబోతున్నాయి.ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులలో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనబోతున్నారు.
బ్యాంక్ ఉద్యోగుల వేతన సమస్యలను కూడా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఆ మూడు బ్యాంకులను విలీనం చేయనున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వం ప్రకటించింది.బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదన హానికరమైన చర్య అని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్ బియు) పేర్కొంది.దాదాపు 9 బ్యాంకు యూనియన్లు యుఎఫ్బియుగా ఏర్పడి సమ్మెలో పాల్గొంటున్నాయి.