కెసిఆర్ ప్రకటించిన అన్ని పథకాలకు సంబంధించి స్థానికతను 1956 అంతకుముందుగా నిర్ణయించడంతో అటు ఆంధ్ర ప్రజలతో పాటు తెలంగాణా ప్రజలు కూడా కలవరపాటు కు గురౌతున్నారు.ఇప్పటివరకు స్థానికతను నిరూపించుకోవడానికి స్థానిక మునిసిపల్ ద్రువికరణ పత్రమో లేక రేషన్ కార్డు , పదవ తరగతి మేమో నో చూపించే వారు, కాని ఇవన్ని గత అయిదు లేదా పది సంవస్త్సారాల స్థానికతను నిరూపించడానికి మాత్రమే ఉపయోగ పడతాయి, కాని 1956 నుండి చుపిన్చాలంటే ఎలాంటి ద్రువపత్రాలను తీసుకురావాలో అని తెలంగాణ ప్రజలందరు బయపడుతున్నారు.
ప్రతిరోజు కెసిఆర్ ఘర్షణ పూరిత వాతావరణంలో అర్థం లేని నిభందనలు పెడుతున్నాడని వాపోతున్నారు.ఇప్పటివరకు జిహెచ్ఏంసి పరిధిలో పేద వల్ల ఇల్లు కూలుస్తూ వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్న కెసిఆర్ ఇక ముందుముందు ఎలాంటి నిభందనలు తీసుకొస్తూ ప్రజలకి నిద్రలేని రాత్రులు ఇస్తాడో అని అనుకుంటున్నారు.