దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజకీయాలకి అతీతంగా అన్ని పార్టీల వారు ప్రభుత్వానికి, ప్రభుత్వాన్ని నడిపించే ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది.అయితే ఇలాంటి వేళ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, మోడీని ద్వేషించి కొంత మంది షోకాల్డ్ సెక్యులరిస్టులు, కమ్యూనిస్ట్ లు రాజకీయాలు మాట్లాడుతూ ప్రధాని మోడీ మీద విమర్శలు చేస్తున్నారు.
మోడీ దేనికి పిలుపునిచ్చిన దానిని బూతద్దంలో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.అయితే ఇలాంటి వారికి ప్రజలే నేరుగా సోషల్ మీడియాలో బుద్ధి చెబుతున్నారు.
ఇలా మోడీ మీద అదే పనిగా విమర్శలు చేసేవారిలో ఒకప్పటి ఆప్ నేత, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అల్కా లంబా ఒకరు.
తాజాగా ఆమె ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ అందులో మోడీ ఇమేజ్ ని ఉపయోగించింది.
దీనిపై చాలా మంది విమర్శలు చేసారు.అందులో ఒలింపిక్ విన్నర్ యోగేశ్వర్ దత్ కూడా ఉన్నారు.
నువ్వేంటో నీ మసన్తత్వాన్ని చెప్పేలా నీ పదాలు ఉన్నాయి.ఎవరి ఫోటో మీద ఈ పదాలు రాశావో ఆయనపై దేశ ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలు తెలుసుకోవాలి.
నీలాంటి పిచ్చి వాళ్లు తప్పించిన ఆయన వెంట యావత్ దేశం నిలిచిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇక యోగేశ్వర్ అలా కామెంట్స్ చేయడం తట్టుకోలేకపోయిన ఆల్కా ఏకంగా అతని మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసింది.
ఏకంగా అతని తల్లి, తండ్రి సంబంధాన్ని ప్రస్తావిస్తూ అసభ్యపదజాలంలో దూషించింది.ఇక ఆమె చేసిన ట్వీట్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇంత నీచమైన కామెంట్లు చేసే నువ్వు అసలు రాజకీయాలకి పనికిరావు, నువ్వు ఎంత మూర్ఖురాలివో నీ కామెంట్స్ చెబుతున్నాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు.ఇక ఆమె కామెంట్స్ పై యోగేశ్వర్ కూడా స్పందించి అలంటి వారి నుంచి అంతకు మించి ఏమి ఆశించగలం అంటూ తేల్చేసాడు.