టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలలో హీరోయిన్ల పాత్రల గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ పాత్ర కేవలం 15 నిమిషాలకు పరిమితమైన సంగతి తెలిసిందే.అలియా భట్ పోషించిన సీత పాత్రకు సంబంధించిన సీన్లు బాగానే ఉన్నా అలియా ఫ్యాన్స్ మాత్రం ఆమె రోల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ సైతం అలియా భట్ పాత్ర పరిధిని పెంచి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ అభిప్రాయం వైరల్ అయింది.అయితే ఆచార్యలో పూజా హెగ్డేకు కూడా అలాంటి పాత్రే దక్కింది.
సినిమాలో పూజా హెగ్డే 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం కనిపించదు.సినిమాలో నీలాంబరి పాత్ర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా లేదని కామెంట్లు వినిపించాయి.
సిద్ధ నీలాంబరి పాత్రల మధ్య కెమిస్ట్రీని అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ ఫెయిల్ అయ్యారు.
మరోవైపు పూజా హెగ్డే నెగిటివ్ సెంటిమెంట్ వల్లే ఈ సినిమా ఫ్లాపైందని మరి కొందరు చెబుతున్నారు.మరోవైపు ఆచార్య సినిమాలో ఎక్కువ సంఖ్యలో విలన్లు ఉన్నా ఒక్క విలన్ కు కూడా సరైన ప్రాధాన్యత దక్కకపోవడం గమనార్హం.ఈ సినిమా రిజల్ట్ విషయంలో ప్రేక్షకుల ముందు కొరటాల శివ దోషిగా నిలబడ్డారు.
చరణ్ కెరీర్ లో వినయ విధేయ రామ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవగా ఈ సినిమా ఆ సినిమాను మించిన ఫ్లాప్ గా ఆచార్య నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలను చూసిన ప్రేక్షకులకు రొటీన్ కథ, కథనాలతో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు.