స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికి తెలిసిందే.ఇక ఈ సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్న దీప, డాక్టర్ బాబు, సౌందర్య, మోనిత లా నటన బాగా ఉంటుంది.
ఇదిలా ఉంటే డాక్టర్ బాబు గా నటిస్తున్న నిరుపమ్ పరిటాల.బుల్లితెర లో ఎన్నో సీరియల్ లో నటించి బుల్లితెర శోభన్ బాబు గా గుర్తింపు అందుకున్నాడు.
అలనాటి నటుడు, డైలాగ్ రైటర్ ఓంకార్ కుమారుడు నిరుపమ్.ఇక ఆయన మరో బుల్లితెర నటి మంజుల ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.వారికి ఒక బాబు ఉన్నాడు.ఇక ప్రస్తుతం వీరిద్దరూ బుల్లితెరలో బిజీగా ఉన్నారు.
బుల్లితెర క్యూట్ కపుల్ గా ఉన్న ఈ జంట ఈటీవీలో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమయ్యారు.ఆ సమయంలోనే వీరి మధ్య పరిచయం పెరిగిందట.
ఇదిలా ఉంటే ఈ నిరుపమ్ డాక్టర్ బాబు చంద్రముఖి మంజుల కోసం ఏకంగా గోడ దూకడట.,/br>
తాజాగా ఈ జంట ఈటీవీ లో ప్రసారమైన ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక అందులో ఆలీ అడిగిన ప్రశ్నలకు ఎంతో సరదాగా సమాధానాలు చెప్పారు.అంతేకాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా పంచుకున్నారు.
ఇదిలా ఉంటే నిరుపమ్ కి అష్టా చమ్మా సినిమాలో అవకాశం కూడా వచ్చిందట.అందులో ఒక్క సీన్ కూడా ఇచ్చారట.
ఇక దాని కోసం ప్రిపేర్ కూడా అవ్వగా.మీరు టీవీలో నటిస్తున్నారా అని ఇంకెందుకులే అని అన్నారట.
ఇదిలా ఉంటే నిరుపమ్ కు గోడదూకే అలవాటు ఉందట.ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఓసారి గోడ దూకడట.
ఇక ఆ తర్వాత మంజుల కోసం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ రోజు అర్ధరాత్రి గోడ దూకానని తెలిపాడు నిరుపమ్.