తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ది బెస్ట్ టాక్ షోగా జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్లో ప్రసిద్ధికెక్కిన అలీతో సరదాగా కార్యక్రమం ఒకటి.రోజురోజుకూ ఉన్నత స్థాయికి చేరుకుంటోంది.
ఈ షోకి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఆలిండియా బెస్ట్ కమెడియన్లలో ఒకరు అలీగారు.తన ప్రతిభతో సినిమాల్లో నవ్వుల్ని కురిపించి ఓ పక్క మంచి హాస్యనటుడుగానూ… మరో పక్క అగ్ర హీరోలతో కలిసి నటించి.
తన టాలెంట్ను నిరూపించుకున్నారు.నేటికీ తన మాటలతో, చేతలతో తెలుగు ప్రజల గుండెల్లో ఓ చెరగని జ్ఞాపకంగా .అలీతో సరదాగా అనే కార్యక్రమంతో ఇంకా అందరినీ అలరిస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉండగా.
ఈ కార్యక్రమానికి విచ్చేసే ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు.అదీగాక, అలీ అడిగే ప్రశ్నాసరళి అందరినీ కట్టిపడేస్తుంది.
ఎలాంటి కాంట్రవర్షియల్ సంభాషణ లేకుండా.సూటిగా, సరదాగా మాట్లాడుకునే ఈ షో అన్నితరాలనూ కట్టిపడేస్తుంది.
నేడు టీవీ అనగానే అనవసర చర్చలు, లేనిపోని ప్రశ్నలూ వేసి వచ్చిన సెలబ్రెటీని ఊపిరాడకుండా చేసే షోలే ఎక్కువ గుర్తొస్తాయి.కానీ ఈ కార్యక్రమం అన్నితరాల వారినీ మెప్పిస్తూ మన్ననలు పొందుతుందంటే అలీగారి వాక్చాతుర్యమే అనడంలో సందేహం లేదు.
ఇకపోతే ఈ వారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని బట్టి చూస్తే.ఈ కార్యక్రమానికి అతిథులుగా సింగర్ మనో, ఆయన భార్య జమీలా విచ్చేసినట్లు తెలుస్తోంది.మీ పరిచయం ఎలా మొదలైందన్న ప్రశ్నకు జమీలా చెప్పే సమాధానం అందరినీ ఆకట్టుకుంటుంది.ఇప్పటివరకూ మనో పాడిన అన్ని పాటలూ తనకిష్టమేనని.ముఖ్యంగా ‘ప్రియా ప్రియతమా రాగాలు‘ అనే పాట చాలా ఇష్టమని తెలిపారు.ఓ సారి ‘గమపస పస’ అంటూ స్వరం రాశానని.
అది దర్శకుడు విశ్వనాథ్ గారికి నచ్చిందని మనో అన్నారు.
ఇంతలోనే విజయ కృష్ణమూర్తి గారు పిలిచి.‘ఇంకోసారి స్వరం రాసావనుకో మద్రాసులో ఉండవు’ అని అన్నారని మనో నవ్వుతూ… ఒకప్పటి సన్నివేశాన్ని పంచుకున్నారు.అలాగే రజనీకాంత్ నటించిన చంద్రముఖిలోని డైలాగులు చెప్పి వాహ్వా అనిపించారు.
ఇంకా వారివురు ఏమేం సంగతులు చెప్పారో తెలుసుకోవాలంటే ఈ వారం వచ్చే ఎపిసోడ్ దాకా ఆగాల్సిందే.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.