టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటించడంతో పాటు నటిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ముమైత్ ఖాన్.తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ముమైత్ ఖాన్ ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న డ్యాన్సీ ప్లస్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్ ను మోసం చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో ముమైత్ ఖాన్ వార్తల్లో నిలిచారు.అయితే ముమైత్ మాత్రం ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి డ్రైవర్ తనను బ్లాక్ మెయిల్ చేశాడని వెల్లడించారు.
అయితే తాజాగా ముమైత్ ఖాన్ అలీతో సరదాగా షో కు గెస్ట్ గా హాజరు కాగా ఈ షోలో ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు.ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే పాటలో షోలోకి ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ తాను తెలుగులో బాగా మాట్లాడతానని అన్నారు.
నువ్వు అమ్మాయివా.? అబ్బాయివా.? అని అలీ అడగగా ముమైత్ ఖాన్ తాను రెండూ అని సమాధానం ఇచ్చారు.
మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లలో ఎవరికి ముద్దు పెడతారని అడగగా ముమైత్ నవ్వుతూ తాను మూడు ఆప్షన్స్ ఇస్తానని చెప్పి ముమైత్ ఖాన్, అనుష్క, సమంత అనే ఆప్షన్స్ ఇవ్వగా అలీ మాత్రం ఇంకో ఆప్షన్ కూడా ఉందని తన వైఫ్ జుబేదాకు ముద్దు పెడతానని అన్నారు.ఆ తరువాత డిక్టేటర్ మూవీ షూటింగ్ లో స్లిప్ అయ్యానని తల నుంచి రెండు రోజుల పాటు రక్తం కారిందని 15 రోజుల పాటు కోమాలో ఉన్నానని అన్నారు.
మూడు సంవత్సరాల పాటు డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారని.
కానీ తాను కేవలం మూడు నెలలు రెస్ట్ తీసుకొని షూటింగ్ లో పాల్గొన్నానని ఆమె అన్నారు.కోమాలో ఉన్న సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి తెలుసుకొని ముమైత్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యారు.