తెలుగు సినీ నటుడు, జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి.ఈయన తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.2002లో ఈశ్వర్ సినిమాలో తొలిసారిగా నటించాడు.ఆ తర్వాత పలు సినిమాలలో కొన్ని పాత్రలలో నటించాడు.
ఇదిలా ఉంటే ఎస్ఎస్ రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేశాడట.
ఇక ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో కమెడియన్ గా చేస్తూ తన పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా నిలిచి టీం లీడర్ గా గుర్తింపు పొందాడు.అంతేకాకుండా తన పంచ్ లతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
ఇదిలా ఉంటే అదిరే అభి ఏకంగా ఐదు లక్షలు మోసపోయాడట.
ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో కి అదిరే అభి, ఆటో రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేయగా అందులో ఎంతో సందడి చేశారు.ఇక తమ వ్యక్తిగత విషయాల ను కూడా పంచుకున్నారు.ఇక అదిరే అభి ప్రభాస్ తో పాటే ఇండస్ట్రీకి పరిచయం అయ్యానని తెలిపాడు.బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడట.
ఇక ఆయన 5 లక్షలను మోసపోయిన విషయాన్ని కూడా పంచుకున్నాడు.బాహుబలి సినిమా కు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన తర్వాత దీనికోసం ఒక ప్రొడ్యూసర్ ను నమ్మి తనకు డైరెక్షన్ ఇస్తానని అనడంతో తననే ఫైనాన్షియల్ గా ముంచారని అలీ అనగా.వెంటనే అదిరే అభి ఎన్నో కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు ఐదు లక్షలు ఇవ్వలేమా అన్నాడు.ఇక ఆ 5 లక్షలు రాబట్టు కోసం ఎస్ పీ లకు, ఎస్ ఐ లకు ఫోన్లు చేసి తెగ రిక్వెస్ట్ చేశాడట.
ఇక ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.