దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్స్తో పాటు, అక్కడ ఉన్న నెపోటిజంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.మంచి భవిష్యత్తు ఉన్న సుశాంత్ను ఎదగనీయకుండా కొందరు అడ్డు పడడంతోనే అతడు మానసిక క్షోభకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు అంటుంటే.
మరి కొందరు అతడిది హత్యే అని ఆరోపిస్తున్నారు.ఇక సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అతడికి దూరం అవ్వడం వెనక సీనియర్ దర్శకుడు మహేష్భట్ ఉన్నాడన్న వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
మహేష్భట్ రియాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు లీక్ కావడంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఉందన్న గుసగుసలు కూడా బయటకు వచ్చాయి.రియాను మహేష్భట్ వాటేసుకుని ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
ఇక రియా, మహేష్ మధ్య జరిగిన చాటింగ్ సంభాషణ కూడా వీరి క్లోజ్నెస్ను బయట పెట్టింది.ఇదిలా ఉంటే మహేష్భట్ కుమార్తె, క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ గతంలో సుశాంత్ గురించి విమర్శిస్తూ మాట్లాడడంతో పాటు ఇప్పుడు ఆమె తండ్రి మహేష్ సైతం సుశాంత్ను టార్గెట్ చేసేలా రియాను ప్రేరేపించారన్న సందేహాల నేపథ్యంలో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆమె తాజా చిత్రం సడక్ 2 ట్రైలర్ ప్రపంచంలోనే ఎక్కువ డిస్ లైక్లు సాధించిన సినిమాగా పరమ చెత్త రికార్డు మూటకట్టుకుంది.ముందు నుంచి ఈ సినిమాను నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన సినిమా అభిమానులు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఓ ఆటాడుకుంటున్నారు.ఈ సినిమాకు ప్రఖ్యాత ఐఎండీబీలో చాలా ఘోరంగా 1 / 10 రేటింగ్ ఇచ్చారు.ఈ ప్రఖ్యాత సంస్థలో ఇంత చెత్త రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా సడక్ 2 నిలిచింది.
దీంతో ఇది ఆలియా ఫ్యూచర్ సినిమా లన్నింటిపైనా పడుతుందన్న సందేహాలు వస్తున్నాయి.
దీంతో ఇప్పుడు ఆమెను ఒక్క రాజమౌళి మాత్రమే కాపాడగలడని.ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్టులో ఆమెను కంటిన్యూ చేస్తేనే ఆమెకు క్రేజ్ ఉంటుందని. భవిష్యత్తు ఉంటుందని.
ఆమెను రాజమౌళి కూడా పక్కన పెడితే ఆలియాను దేవుడు కూడా కాపాడలేడని.ఆమె భవిష్యత్తు గందరగోళమే అన్న చర్చలు బాలీవుడ్లో వినిపిస్తున్నాయి.
మరి రాజమౌళి ఆలియా విషయంలో ఏం చేస్తాడో ? చూడాలి.