బాలీవుడ్ యువ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు సీనియర్ దర్శక నిర్మాత అయిన మహేశ్భట్ కారణమంటూ గత కొంత కాలంగా అతనిని సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.అతని వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని కించపరుస్తూ మహేష్ భట్ కామాంధుడు అంటూ పోస్టులు పెడుతున్నారు.
అతని సినిమాలని బహిష్కరించాలని ప్రచారం చేస్తున్నారు.సుశాంత్ లాంటి టాలెంటెడ్ నటుడు మరణానికి కారణం అయిన వ్యక్తిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు సోషల్ మీడియాలో సుశాంత్ అభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో తన కూతుళ్లు అలియాభట్, పూజాభట్ నటించిన సడక్- 2 మొదటి పోస్టర్ లుక్ను దర్శకుడు, చిత్ర నిర్మాత మహేశ్భట్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.మీరు ముగింపుకు వచ్చేసరికి అక్కడ ముగింపు లేదని మీరు కనుగొంటారు అని ఇంగ్లిష్లో క్యాప్షన్ ఇచ్చారు.దీనిపై నెటిజన్లు భారీగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.సడక్-2 చిత్రాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు.ఒకరి జీవితానికి ముగింపు పలికి, మీ ముగింపును ఎలా విడుదల చేస్తున్నారు అని పోస్టర్ క్యాప్షన్ను ఉద్దేశిస్తూ మరొకరు ట్వీట్ చేశారు.తన మనువరాలికంటే తక్కువ వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం కలిగి ఉన్న, ఒకరు ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన వ్యక్తి జైల్లో ఉండాలిగానీ బయట ఎలా ఉన్నాడో అర్థంకావట్లేదని విమర్శించారు.
సుశాంత్ ని అభిమానించే వాళ్ళు అతని చావుకి కారణం అయిన మహేష్ భట్ సడక్ సినిమా చూస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.