బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ అందరి చూపును తనవైపు తిప్పుకుంది.స్టార్ కిడ్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ను దక్కించుకుంది.
కాగా ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో హీరోయిన్గా నటిస్తోన్న ఈ బ్యూటీ, పాన్ ఇండియా మూవీతో తన సత్తా మరోసారి చాటాలని చూస్తోంది.
కాగా ఈ బ్యూటీ తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కారణంగా నెటిజన్ల విమర్శలకు గురవుతోంది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణవార్త తనను నిజంగా కలిచివేసిందని, ఆయన లాంటి నటుడిని చాలా మిస్ అవుతామని ఆమె ట్వీట్ చేసింది.అయితే గతంలో సుశాంత్ సింగ్ గురించి పలు కామెంట్స్ చేసిన ఆలియా ఇప్పుడు ఇలా తన విచారాన్ని వ్యక్తం చేయడం ఎంతవరకు సబబు అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
ట్యాలెంటెడ్ వాళ్లు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఎంకరేజ్ చేయాలి తప్ప వారిపై అనవసర కామెంట్స్ చేసి సంతోష పడే ఆలియా లాంటి వాళ్లు ఇలాంటి సమయంలో తమను తాము మంచివారిగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.అటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ను కూడా పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.