సినిమా ఇండస్ట్రీలో, రాజకీయాల్లో కొత్తవాళ్ల కంటే సినీ, రాజకీయ నాయకుల వారసులకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే టాలెంట్ ఉంటే మాత్రమే వారసులు రాజకీయాల్లో, సినిమాల్లో సక్సెస్ అవుతారు.
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెపోటిజం వల్లే సుశాంత్ చనిపోయాడనే కామెంట్లు వినిపించాయి.వారసత్వంతో స్టార్లుగా ఎదిగిన హీరోలను, హీరోయిన్లను నెటిజన్లు ట్రోల్ చేశారు.
మహేష్ భట్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ కు కూడా ఈ తరహా ట్రోలింగ్స్ ఎదురయ్యాయి.తాజాగా అలియా భట్ సుశాంత్ మరణం తరువాత జరిగిన ఘటనల గురించి చెబుతూ ట్రోలింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొందరు నెటిజన్లు తనను ఉద్దేశించి విద్వేషంతో కూడిన పోస్టులు పెడుతున్నారని.టార్గెట్ చేసి తనను టార్చర్ చేస్తున్నారని అన్నారు.
ఇతరుల విషయంలో ఎల్లప్పుడూ దయతో వ్యవహరించాలని ట్రోల్ చేసిన నెటిజన్లకు అలియా సూచించారు.కొందరు నెటిజన్లు తనకు హాని చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.ఆ పోస్టులు తనలో మార్పును తీసుకొస్తున్నాయని.ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ ఉండాలని ఆ పోస్టుల ద్వారా తనకు అర్థమైందని ఆమె తెలిపారు.అలియా భట్ తో పాటు మిగిలిన సినీ వారసులు సైతం ఈ తరహా వేధింపులను ఎదుర్కొన్నారు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అలియా భట్ సినిమాసినిమాకు నటిగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో అలియా నటిస్తున్నారు.టాలీవుడ్ లో అలియా భట్ కు స్టార్ హీరోలకు జోడీగా అవకాశాలు వస్తున్నా ఆమె ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.
ట్రోలింగ్ పై అలియా చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.