బాలీవుడ్ హీరో సుశాంత్ మృతి చెండటంతో బాలీవుడ్లో కొందరిపై తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా ఆలియా భట్ను టార్గెట్గా చేసి కొందరు చేస్తున్న కామెంట్స్ ప్రస్తుతం ఆమె సినీ కెరీర్పై ప్రభావం చూపించే విధంగా ఉన్నాయి.
ఇటీవల ఆమె నటించిన సడక్ 2 చిత్రంకు ప్రేక్షకుల నుండి ఏ స్థాయిలో వ్యతిరేకత వస్తుందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది.సడక్ 2 చిత్రం ట్రైలర్కు యూట్యూబ్లో ఏకంగా 50 లక్షలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి.
ఈ స్థాయిలో ఒక ట్రైలర్కు డిస్లైక్స్ రావడం ప్రపంచ చరిత్రలో రికార్డ్ అయ్యి ఉంటుంది.
ఆలియా భట్ హీరోయిన్ అవ్వడంతో పాటు ఆ సినిమాకు ఆమె తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహించడం వల్ల కూడా ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుందని అంటున్నారు.
సుశాంత్ మృతి కేసులో మహేష్భట్ కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.ఈ సమయంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.ఆలియా భట్ ఈ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.ఆలియా భట్ నటించిందనే ఉద్దేశ్యంతో ఆర్ఆర్ఆర్ను సుశాంత్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆలియా భట్ పై ప్రస్తుతం భయంకరమైన వ్యతిరేకత ఉంది.కనుక ఆమె ఈ సమయంలో ఏం చేసినా కూడా విమర్శలు తప్పవు.అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం రావడానికి ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.కనుక జక్కన్న టీం పై అప్పటి వరకు సుశాంత్ అభిమానుల ప్రతాపం ఉండక పోవచ్చు అంటున్నారు.
ఆలియా భట్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విడుదల చేయకుంటే బెటర్ అనే ఉద్దేశ్యంతో కూడా చాలా మంది ఉన్నారు.మొత్తానికి సుశాంత్ మరణం అనేక ఇబ్బందులను గురి చేస్తోంది.