రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.భారీ బడ్జెట్ తో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు తరహా పాత్రలో కనిపిస్తున్నాడు అనే సంగతి అందరికి తెలిసిందే.
ఇక ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా లో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ రామ్ చరణ్ కి జోడీగా కనిపించబోతుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ కూడా అలియా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకి ఊహించని గుర్తింపు వచ్చింది.
బాలీవుడ్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లని హిట్స్ మీద హిట్స్ కొడుతున్న ఈ భామ ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా గౌరవాన్ని అందుకుంది.బాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోయిన్స్ వెనక్కి నెట్టి ఈ గౌరవాన్ని అలియా భట్ సొంతం చేసుకుంది.
మొత్తం 50 మంది ఈ జాబితాలో పోటీ పడగా అందులో అలియా భట్ మొదటి స్థానం సొంతం చేసుకోగా తరువాత స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె, గాయత్రి భరద్వాజ్, అదితీరావు లాంటి హీరోయిన్స్ ఉన్నారు.ఓ విధంగా ఈ గుర్తింపు అలియాకీ మరింత హుషారు పెంచేది అని చెప్పాలి.