ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని చెప్పవచ్చు.ప్రభాస్ కు బాహుబలికి ముందు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే మార్కెట్ ఉండేది.
తరువాత బాహుబలి రిలీజ్ తరువాత ఒక్కసారిగా ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగి ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే.అయితే ప్రభాస్ కు అలియాభట్ ఊహించని పెద్ద ఝలక్ ఇచ్చింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం అలియాభట్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగూబాయి కతియవాది సినిమాలో నటిస్తోంది.అయితే ఈ సినిమాను జులై 30 వ తేదీన విడుదల చేయనున్నామని దర్శకులు సంజయ్ లీలా భన్సాలీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాను భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా మూవీగా తెరెకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమాను కూడా జులై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రభాస్ సినిమా విడుదల రోజే ఆలియా సినిమా విడుదల వెనుక ప్రభాస్ కు భారీ ఓపెనింగ్స్ రావద్దనే ఇలా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు ఈ వార్త చక్కెర్లు కొడుతుండడంతో ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.