బాలీవుడ్ ప్రేమ జంట రణ్బీర్ కపూర్, ఆలియా భట్ గత మూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ ప్రేమజంట ఎప్పుడెప్పుడు ఒకటి అవుతుందా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
వీరి ప్రేమ విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా తెలిసిపోవడంతో ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు.ఇద్దరూ వారివారి కెరీర్లో సినిమాలతో బిజీగా ఉంటూనే సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు ప్రేమని పంచుకుంటున్నారు.
అయితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది వీరి పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సంవత్సరం డిసెంబర్ లో వీరి పెళ్లి జరగాల్సి ఉండగా.మరొకసారి తాజాగా వీరి పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రేమ జంట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పలు సినిమాలు ఇంకా పూర్తి కాక పోవడం, పలు ఇతర కారణాల వల్ల తమ పెళ్ళిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
మొదట ఈ ప్రేమ జంట కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారట.పెళ్లి అనంతరం ఒక ఖరీదైన ఫ్లాట్ లోకి కూడా మారాలనుకుంటున్నారట.దీనికి సంబంధించి కూడా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయట.
దీనితో అన్ని పనులు అనుకున్నట్లు పూర్తి అయ్యాక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లేదా 2022 డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.