జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలీ వివాదం మనందరికీ తెలిసిందే.సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ, జనసేన పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పవన్ కళ్యాణ్ కు అలీ కి మధ్య తేడా ఉందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ అదేవిధంగా సామాజిక మాధ్యమాలను పెద్దఎత్తున వైరల్గా మారింది.అయితే అప్పటి నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలీ గత సంవత్సరన్నర కాలంగా ఒక్కసారి కూడా కలవకపోవడంతో ఇక వాళ్ళిద్దరూ శాశ్వతంగా మాట్లాడుకోవడం లేదని విషయాన్ని బయట ప్రచారం చేశారు.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్-తన వివాదంపై అలీ స్పందించాడు.పవన్ కళ్యాణ్ నేను ఇప్పటికీ మంచి స్నేహితులమని, రాజకీయపరంగా వచ్చిన విభేదాలు తప్ప వ్యక్తిగతంగా నాకు పవన్ కళ్యాణ్ పై నాకు కోపం లేదని అన్నారు.
అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ ను అలీ కలిసాడు.అయితే పవన్ మీతో ఏమన్నారనే ప్రశ్నకు ఒకరికొకరం పలరించుకున్నామని, త్వరలో కలుద్దామని పవన్ అన్నారని అలీ తెలిపారు.
మేమిద్దరం శత్రువులం కాదని, ఒకరంటే ఒకరికి కోపం లేదని, బయట సోషల్ మీడియా చేసిన రచ్చ ద్వారానే ఇది ఇంత పెద్ద వివాదంగా మారిందని అన్నారు.అయితే 2021 లో పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా ఉండొచ్చని అలీ అన్నారు.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్- అలీ కలయికతో వీరి వివాదానికి తెరపడ్డట్టైంది.