బిగ్ బాస్ తెలుగు మూడవ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.మరో వారం రోజుల్లోనే ఈ సీజన్ ముగియబోతున్న విషయం తెల్సిందే.
బిగ్బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకున్న ఈ సమయంలో షో చాలా ఆసక్తికరంగా మారింది.సీజన్ ఆరంభం నుండి కూడా రాహుల్ మరియు శ్రీముఖిల మద్య విభేదాలు తారా స్థాయిలో ఉంటున్నాయి.
ఆ విభేదాలను ఎప్పటికప్పుడు శ్రీముఖి పక్కకు పెడుతూ వచ్చింది.కాని ఇటీవల రాహుల్తో ఆమె జరిగిన చర్చ తీవ్రం అయ్యింది.
నెం.2 వద్ద నిల్చున్న రాహుల్ను నువ్వు అనర్హుడివి అంటూ శ్రీముఖి వాదించింది.ఆ సమయంలో రాహుల్ కూడా సీరియస్ అయ్యాడు.గయ్యాలి అంటూ శ్రీముఖిని అన్నాడు.అప్పటి నుండి శ్రీముఖి పూర్తి వ్యతిరేకంగా రాహుల్ను టార్గెట్ చేసింది.ఇక నిన్నటి సినీ పాత్రల టాస్క్లో కూడా రాహుల్ మరియు అలీలు శ్రీముఖిని టార్గెట్ చేసి ఆమెకు సహాయ నిరాకరణ చేశారు.
నిన్నటి టాస్క్లో శ్రీముఖికి మహానటి సావిత్రి పాత్ర వచ్చింది.ఆమె డాన్స్ చేసేందుకు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి హెల్ప్ కోరింది.
కాని రాహుల్ మరియు అలీలు నో చెప్పారు.
రాహుల్, అలీ మినహా అంతా కూడా శ్రీముఖి టాస్క్కు హెల్ప్ చేశారు.నిన్నటి ఎపిసోడ్లో శ్రీముఖి టాస్క్ హైలైట్గా నిలిచింది.తనకు హెల్ప్ చేయని వీరిద్దరికి కూడా శ్రీముఖి హెల్ప్ చేయలేదు.
గజినీగా నటించిన అలీకి శ్రీముఖి దూరంగా ఉంది.ఇక రాహుల్ టాస్క్ను అసలు పట్టించుకోనే పట్టించుకోలేదు శ్రీముఖి.
ఈ సీజన్ ముగింపు దశలో ఈ గొడవల వల్ల ఒకరి అభిమానులు ఒకరిపై తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నారు.