ఒకప్పుడు గ్రహాంతర వాసుల గురించి చాలా చర్చలు జరిగేవి.వాళ్లు భూమిపై తిరుగుతున్నారంటూ అనేక పుకార్లు షికారు చేశాయి.
అయితే గత కొన్నేళ్లుగా దీనిపై కాస్త పుకార్లు తగ్గాయి.కానీ ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
అయితే ఇప్పటి వరకు గ్రహాంతర వాసులు ఉన్నారా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా సరైన సమాధానం చెప్పలేదు కానీ పుకార్లు మాత్రం షికారు చేస్తూనే ఉన్నాయి.
జార్ఖండ్లోని హజారిబాగ్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అక్కడ రాత్రి పూట గ్రహాంతరవాసులు సంచరిస్తున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దాన్ని చూసిన స్థానికులు నిజంగానే వణికిపోతున్నారు.
ఆ వీడియో కూడా నిజంగా జరిగినట్టు ఎలాంటి గ్రాఫిక్స లేకుండా ఉండడంతో చూసిన వారంతా నిజంగానే గ్రహాంతర వాసి అనుకున్నారు.కానీ అందులో ఉంది గ్రహాంతర వాసి కాదని, మనిషే అని నిర్దారణ అయింది.
ఆ ప్రాంతానికి చెందిన దీపక్ హెన్బ్రామ్ అనే యువకుడు చక్రధర్పూర్ నుంచి తన ఆరుగురు స్నేహితులతో కలిసి రాత్రిపూట రోడ్డు వెంబడి వస్తున్నాడు. రాత్రి పూట కొద్ది దూరం రాగానే ఓ మహిళ బూడిద ధరించి నగ్నంగా కనిపించింది. ఆమెను దీపక్ వీడియో తీశాడు.సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.అయితే ఆ వీడియోలో ఉన్నది గ్రహాంతర వాసి అని ప్రచారం జరిగింది.ఈ కామెంట్లపై స్పందించిన దీపక్ అసలు విషయం చెప్పాడు.
తన స్నేహితులతో కలిసి తాను రాత్రిపూట వస్తున్నప్పుడు ఓ మహిళ రోడ్డు మీద ఇలా నగ్నంగా బూడిద పూసుకుని తిరుగుతోందని, ఆమె అలా ఎందుకు చేస్తుందో తమకు తెలియదని చెప్పారు.ఆమె గ్రహాంతర వాసి కాదని, హజారిబాగ్లా అలా నగ్నంగా బూడిద పోసుకుని తిరగడం చాలా కామన్ అని, రాత్రి పూట నగ్నంగా మారి బూడిద పూసుకుని పూజలు చేయడం ఇక్కడ పరిపాటి అని వివరించారు.
ఆ మహిళ కూడా అలాగే చేసిందని, ఇందులో ఎలాంటి గ్రహాంతర వాసిలేదని స్పష్టం చేశారు.