గత సంవత్సరం కానివినియెరగని రీతిలో మద్యంపై భారీగా ధరలు పెంచిన ప్రభుత్వం త్వరలోనే మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.ఈ న్యూస్ కూడా నిజం అయ్యింది అంటే మందుబాబులు పండగ చేసుకోవడం ఖాయం.
అలాంటి న్యూస్ ఇది.త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందింది.
నిజానికి గత సంవత్సరమే మద్యంపై ధరలను భారీగా పెంచిన ప్రభుత్వం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మూతపడిన మద్యం షాపులను అన్లాక్ లో మళ్ళీ తెరిచిన తర్వాత ఏకంగా 75 శాతం మేర లిక్కర్ ధరలను ప్రభుత్వం పెంచింది.అయితే ఈ పెంచిన ధరల్లో కొంతమేర తగ్గించే అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ వర్గాల సమాచారంఇచ్చాయి .
ఎంతకాదు అన్న కనీసం అంటే కనీసం 30 శాతం నుంచి 40 శాతం వరకు మద్యం ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గిస్తారని సమాచారం.మరి ఈ వార్త ఎంతవరకు నిజం అవుతుంది అనేది చూడాలి.ఏది ఏమైనా ఈ వార్త నిజం అవుతే మందుబాబులకు పండగ అనే చెప్పాలి.